ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు దోచేసిన ముగ్గురు నిందితును మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్కి చెందిన వివేక్, మందమర్రికి చెందిన మంజులకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. రాజకీయ నాయకులతో దిగిన ఫొటోలు పెడ్తూ నాకు వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసని నమ్మించాడు. ఐసీడీఎస్ శాఖలో సెక్రటరీగా నీకు ఉద్యోగమూ ఇప్పిస్తానని, దానికి కొంచెం డబ్బు ఖర్చువుతుందని అమ్మాయికి చెప్పాడు. ఇదంతా నిజమేనని నమ్మిన మంజుల డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకుంది. వివేక్ తన స్నేహితులు ప్రణయ్, రాకేష్తో కలిసి ఆమె దగ్గర నుంచి 3 లక్షల రూపాయల చెక్కును తీసుకున్నారు. వారి మాటల్లో తేడాను గమనించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పథకం ప్రకారం మరో 50 వేలు ఇస్తానని చెప్పించారు. మందమర్రికి పిలిపించి వివేక్, రాకేష్, ప్రణయ్లను అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి: తెరాసకు సోమారపు సత్యనారాయణ రాజీనామా