ETV Bharat / state

బస్సు కోసం విద్యార్థుల ఆందోళన

author img

By

Published : Jul 19, 2019, 12:49 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని గూరకొండ విద్యార్థులు బస్సు సౌకర్యం కోసం రోడ్డెక్కారు.

బస్సు కోసం విద్యార్థుల ఆందోళన

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గూరకొండ గ్రామం నుంచి బస్సు వేయాలని విద్యార్థులు ధర్నా నిర్వహించారు. రోజూ సుమారు 100 మంది విద్యార్థులు ఇంటర్, డిగ్రీ, పీజీ చదివేందుకు పొరుగూరు వెళ్తుంటారు. తమకు బస్సు సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటలకు బస్టాండుకు వచ్చినా 11 వరకు కళాశాలకు చేరుకోలేకపోతున్నామని వాపోయారు. నిత్యం రెండు తరగతులు నష్టపోతున్నామని..వెంటనే బస్సు సదుపాయం కల్పించాలని కోరారు.

బస్సు కోసం విద్యార్థుల ఆందోళన
ఇవీ చూడండి: వరద బీభత్సంతో రాష్ట్రాలు అతలాకుతలం

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గూరకొండ గ్రామం నుంచి బస్సు వేయాలని విద్యార్థులు ధర్నా నిర్వహించారు. రోజూ సుమారు 100 మంది విద్యార్థులు ఇంటర్, డిగ్రీ, పీజీ చదివేందుకు పొరుగూరు వెళ్తుంటారు. తమకు బస్సు సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటలకు బస్టాండుకు వచ్చినా 11 వరకు కళాశాలకు చేరుకోలేకపోతున్నామని వాపోయారు. నిత్యం రెండు తరగతులు నష్టపోతున్నామని..వెంటనే బస్సు సదుపాయం కల్పించాలని కోరారు.

బస్సు కోసం విద్యార్థుల ఆందోళన
ఇవీ చూడండి: వరద బీభత్సంతో రాష్ట్రాలు అతలాకుతలం
Intro:Tg_Mbnr_03_19_Bus_Kosam_Andholana_Avb_TS10094
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లోని గూరకొండ విద్యార్థులు విద్యార్థుల బస్సు కోసం ఆందోళన బాట పట్టారు. గ్రామం నుంచి నిత్యం వంద మంది విద్యార్థులు దేవరకద్ర మండల కేంద్రానికి అటు నుంచి జిల్లా కేంద్రానికి ఉన్నత చదువుల కోసం వెళ్తుంటారు. కళాశాల సమయం లో సరైన బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు


Body:దేవరకద్ర మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గూరకొండ గ్రామం నుంచి నిత్యం దేవరకద్ర కు అటు నుంచి జిల్లా కేంద్రానికి సుమారు 100 మంది విద్యార్థులు ఇంటరు, డిగ్రీ, పీజీ , ఇంజనీరింగ్ b.ed ,ttc లాంటి ఉన్నత చదువుల కోసం వెళ్తుంటారు వారికి అవసరమైన బస్సులు గ్రామం లోని గేటు మీదుగా నారాయణపేట నుంచి మరికల్ మీదుగా అనేక బస్సులు మహబూబ్ నగర్ వైపునకు వచ్చినా అవి అక్కడి నుంచి నిండుగా రావడంతో గేటు దగ్గర ఆపకుండానే దేవరకద్రకు వస్తున్నాయి.
బస్సులు గేటు దగ్గర నిలుపకుండా రావడంతో బస్ కోసం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు నిలిచిన ఒక్క బస్సు ఆపకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు దీంతో నిత్యము వారు 2 తరగతులను నష్టపోతున్నామని చదువులో వెనకబడి పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు
గూరకొండ గ్రామానికి ప్రత్యేకంగా విద్యార్థుల బస్ నడిపించాలని కోరేందుకు గ్రామం నుంచి ప్రత్యేక ట్రాక్టర్ పై
మహబూబ్ నగర్ ఆర్టిసీ డిపో మేనేజర్ ను కలిసేందుకు బయలుదేరి వెళ్లారు . విద్యార్థుల బస్సు నడిపిస్తామని గట్టి హామీ ఇచ్చేంత వరకు ఆర్టీసీ డిపో ముందు ఆందోళన చేస్తామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు
1 విద్యార్థి గూరకొండ
2 విద్యార్థి గూర కొండ
3 విద్యార్థి గూరకొండ
4 విద్యార్థి గూరకొండ


Conclusion:గూరకోండ గ్రామానికి విద్యార్థుల బస్సు కల్పించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన బాట పట్టారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.