ETV Bharat / state

'కొవిడ్ బాధితులకు పోస్టల్ ద్వారా ఓటు అవకాశమివ్వండి'

author img

By

Published : Apr 20, 2021, 10:36 PM IST

జడ్చర్ల మున్సిపాలిటీలో.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీధర్ పర్యటించారు. పట్టణంలో జరగబోయే ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

jadcherla municipal elections
జడ్చర్ల మున్సిపల్​ ఎన్నికలు

జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీధర్ సమావేశమయ్యారు. పట్టణంలో ఈ నెల 30న జరగబోయే ఎన్నికలను సజావుగా నిర్వహించాలని అధికారులను కోరారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు.

కొవిడ్ పాజిటివ్​ వచ్చిన వారితో పాటు.. 80 సంవత్సరాల పైబడిన వారికి, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.

జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీధర్ సమావేశమయ్యారు. పట్టణంలో ఈ నెల 30న జరగబోయే ఎన్నికలను సజావుగా నిర్వహించాలని అధికారులను కోరారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు.

కొవిడ్ పాజిటివ్​ వచ్చిన వారితో పాటు.. 80 సంవత్సరాల పైబడిన వారికి, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.

ఇదీ చదవండి: అమల్లోకి రాత్రి కర్ఫ్యూ.. మే 1 వరకు ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.