NGT on Palamuru- Rangareddy Project: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్ మరోసారి వాయిదా వేసింది. కోస్గి వెంకటయ్య, డి.చంద్రమౌళీశ్వర రెడ్డితో పాటు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై... జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కృష్ణా బోర్డు అందించిన వాస్తవ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. సవివరంగా ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది.
అఫిడవిట్ దాఖలు
ప్రాజెక్టును సేఫ్ లెవెల్ వరకు తీసుకెళ్లడానికి పనులు చేశామని ఏదైనా లోపాలు ఉంటే... క్షమాపణలు చెప్పేందుకు అనుమతించాలని తెలంగాణ సాగునీటి శాఖ చీఫ్ఇంజినీరు అఫిడవిట్ దాఖలు చేశారు. పిటిషనర్ల ఆరోపణలు సరికావని.... వాటిని కొట్టేయాలని తెలంగాణ సోమేశ్ కుమార్ అఫిడవిట్ వేశారు. మట్టి తవ్వకాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని సంయుక్త కమిటీ ఇప్పటికే నివేదిక అందజేయగా.... అన్ని విషయాలు 25న పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.
ఇదీ చదవండి: ఇక ప్రకటనల పరంపర.. రోస్టర్, రిజర్వేషన్లు, జోనల్పై స్పష్టత