ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ విజృంభించాయి. ఆదివారం కాస్త తగ్గిన.. సోమవారం రికార్డు స్థాయిలో 697 కేసులు నమోదయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
మహబూబ్నగర్ జిల్లాలో 197, జోగులాంబ గద్వాల 160, నాగర్కర్నూల్ జిల్లాలో 144, వనపర్తి జిల్లాలో 133, నారాయణపేట జిల్లాలో 60 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. మహబూబ్నగర్ జిల్లాలో రెండు వందలకు చేరువగా కేసులు నమోదు కాగా.. జిల్లా కేంద్రంలో 77, గ్రామీణంలో 7, జడ్చర్ల 28, గండీడ్ 20, దేవరకద్ర 18, భూత్పూర్ 13, సీసీకుంట 10, బాలానగర్ 7, హన్వాడ 6, నవాబుపేట 4, కోయిల్కొండ, అడ్డాకులలో ముగ్గురు చొప్పున కరోనా బారిన పడ్డారు. సీసీకుంట, మూసాపేటకు చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో 160కేసులకు గాను.. గద్వాల జిల్లా కేంద్రంలో 24, అయిజ 27, గట్టు, మానవపాడు 16 చొప్పున, అలంపూర్ 13, వడ్డేపల్లి 12, క్యాతూర్ 10, ధరూర్ 9, ఇటిక్యాల 8, రాజోలి 7, మల్దకల్ మండలంలో 5 మందికి కరోనా నిర్ధరణ అని తేలింది.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో 20, కల్వకుర్తి 30, పెంట్లవెల్లి 14, అచ్చంపేట 12, తెల్కపల్లి 10, బిజినేపల్లి 9, కొల్లాపూర్ 8, తాడూర్ 7, వెల్దండ 6, ఉప్పునుంతల 4, అమ్రబాద్, బల్మూర్, లింగాల 3 చొప్పున, చారకొండ, పదర మండలలాల్లో ఒక్కొక్కరు కొవిడ్ బారిన పడ్డారు.
వనపర్తి జిల్లాలోని చిన్నంబావిలో ఒకే రోజు 54 కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలో 23 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కొత్తకోట 12, పెబ్బేరు 11, ఘన్పూర్ 10, పాన్గల్ 5, వీపనగండ్ల, పెద్దమందడి 4 చొప్పున, గోపాల్పేట, రేవల్లి 3, శ్రీరంగాపూర్, చిన్నంబావి రెండు చొప్పున.. ఆత్మకూర్, అమరచింత మండలాల్లో ఒక్కొ కేసు నమోదైంది.
నారాయణపేట జిల్లాలో 60 కేసులు నమోదుకాగా.. పట్టణంలో 15, కర్నే 13, నర్వ 9, దామరగిద్ద 7, కోటకొండ 4, ధన్వాడ 3, మాగనూర్, మద్దూర్, ఉట్కూర్, గుండుమాల్లలో ఇద్దరు చొప్పున, మరికల్ మండలంలో ఒకరు కరోనా బారిన పడ్డారు.
ఇదీ చూడండి: కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది!