ETV Bharat / state

'భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా కోయిల్​సాగర్​'

author img

By

Published : Aug 29, 2020, 6:40 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్​సాగర్​లో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పర్యటించారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్​రెడ్డి, రాజేందర్​ రెడ్డితో కలిసి కోయిల్​సాగర్​ జలాశయంలో 7 లక్షల చేప పిల్లలను మంత్రి వదిలారు.

minister srinivas reddy visited koilsagar
minister srinivas reddy visited koilsagar

కోయిల్​సాగర్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి కోయిల్​సాగర్​లో 3 రకాలకు చెందిన 7 లక్షల చేప పిల్లలను వదిలారు.

'భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా కోయిల్​సాగర్​'

తొలుత కోయిల్​సాగర్ వద్ద హరిత హోటల్ నిర్మించి... అనంతరం దశల వారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. జలాశయం వద్ద హట్స్, బోటింగ్​కు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆధికారులను ఆదేశించారు. కోయిల్​సాగర్​ను పూర్తిస్థాయి నీటి పారుదల ప్రాజెక్టుగా మార్చనున్నామని... జూరాల నుంచి కాకుండా భవిష్యత్తులో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జలాశయాన్ని నింపుకునే అవకాశాలున్నాయని వివరించారు. కోయిల్​కొండ, రాంకొండ, మన్యంకొండ, మహబూబ్​నగర్ మొత్తాన్ని కలుపుకుని మహబూబ్​నగర్ జిల్లాను పర్యాటక ప్రాంతగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

కోయిల్​సాగర్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి కోయిల్​సాగర్​లో 3 రకాలకు చెందిన 7 లక్షల చేప పిల్లలను వదిలారు.

'భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా కోయిల్​సాగర్​'

తొలుత కోయిల్​సాగర్ వద్ద హరిత హోటల్ నిర్మించి... అనంతరం దశల వారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. జలాశయం వద్ద హట్స్, బోటింగ్​కు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆధికారులను ఆదేశించారు. కోయిల్​సాగర్​ను పూర్తిస్థాయి నీటి పారుదల ప్రాజెక్టుగా మార్చనున్నామని... జూరాల నుంచి కాకుండా భవిష్యత్తులో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జలాశయాన్ని నింపుకునే అవకాశాలున్నాయని వివరించారు. కోయిల్​కొండ, రాంకొండ, మన్యంకొండ, మహబూబ్​నగర్ మొత్తాన్ని కలుపుకుని మహబూబ్​నగర్ జిల్లాను పర్యాటక ప్రాంతగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.