ETV Bharat / state

ఆపదలో అండగా ఉంటాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

author img

By

Published : Oct 30, 2020, 7:23 AM IST

Updated : Oct 30, 2020, 8:36 AM IST

పేద కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. వారిని ఆదుకోవడానికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని అన్నారు. మహబూబ్​నగర్​, హన్వాడ మండలాల్లో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

minister srinivas goud distribute cmrf funds in mahaboobnagar district
ఆపద కాలంలో అండగా ఉంటాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఆపదలో ప్రజలకు అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు. వైద్యపరంగా నిరుపేద కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించి... ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నామని చెప్పారు. మహబూబ్​నగర్, హన్వాడ మండలాల్లోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. భూత్పూర్​లో పంచవటి స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మహబూబ్​నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ప్రజలకు అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు. వైద్యపరంగా నిరుపేద కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించి... ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నామని చెప్పారు. మహబూబ్​నగర్, హన్వాడ మండలాల్లోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. భూత్పూర్​లో పంచవటి స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మహబూబ్​నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సురేందర్​ బ్యాంకు లాకర్​లో భారీగా నగదు, బంగారం

Last Updated : Oct 30, 2020, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.