మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామానికి చెందిన 17సంవత్సరాల బాలు అనే యువకుడు స్థానిక ఐటీఐ కళాశాల్లో విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో తమ సమీప బంధువులకు చెందిన అమ్మాయితో ప్రేమ వ్యవహరం నడుపుతున్నాడు. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీచూడండి: చెత్తకుండీలో బాలుడి మృతదేహం