ETV Bharat / state

'శ్రమదానం చేయండి... వడ్డీలేని రుణాలు పొందండి..' - errabelli dayakara rao tour

గ్రామాల్లో శ్రమదానం చేసిన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేయనున్నట్లు పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రకటించారు. మంత్రి శ్రీనివాస్​ గౌడ్​తో కలిసి మహబూబ్​నగర్​ జిల్లా హన్వాడ గ్రామసభకు హాజరయ్యారు.

'శ్రమదానం చేయండి... వడ్డీలేని రుణాలు పొందండి..'
author img

By

Published : Oct 3, 2019, 9:04 PM IST

ప్రతి గ్రామానికి ఏడాదికి కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. మహబూబ్​నగర్ హన్వాడ గ్రామసభకు మంత్రి శ్రీనివాస్ గౌడ్​తో కలిసి హాజరయ్యారు. శ్రమదానం చేసిన మహిళ సంఘాలకు 50వేల నుంచి 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో గ్రామాల స్వరూపాలు మారుతున్నాయన్నారు.

'శ్రమదానం చేయండి... వడ్డీలేని రుణాలు పొందండి..'

ఇవీచూడండి: 'ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలోనే నడవాలి'

ప్రతి గ్రామానికి ఏడాదికి కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. మహబూబ్​నగర్ హన్వాడ గ్రామసభకు మంత్రి శ్రీనివాస్ గౌడ్​తో కలిసి హాజరయ్యారు. శ్రమదానం చేసిన మహిళ సంఘాలకు 50వేల నుంచి 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో గ్రామాల స్వరూపాలు మారుతున్నాయన్నారు.

'శ్రమదానం చేయండి... వడ్డీలేని రుణాలు పొందండి..'

ఇవీచూడండి: 'ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలోనే నడవాలి'

Intro:TG_Mbnr_07_03_Errabelli_On_30Days_Action_Plan_AVB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో గ్రామాల స్వరూపాలు మారుతున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టంచేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన హన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు.


Body:30 రోజుల ప్రత్యేక కార్యచరణ లో మాత్రమే కాకుండా.. అనంతరం గ్రామ యువత, మహిళలు నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పాల్గొన్న ఆయన... గ్రామాల అభివృద్ధికి చేపట్టిన ప్రత్యేక కార్యాచరణలో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు గ్రామాల స్వరూపాలే మార్చుతున్నారని పేర్కొన్నారు. మన ఊరిని మనమే బాగు చేసుకోవాలని అందుకు యువత ముందు ఉండాలని అన్నారు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామన్నారు. ప్రతి గ్రామానికి ఏడాదికి కోటి రూపాయల చొప్పున.. ఐదేళ్లలో ఐదు కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


Conclusion:గ్రామ పంచాయతీలలో నిరంతరంగా పనిచేసేందుకు సఫాయిలను నియమిస్తున్నట్టు.. మరో రెండు రోజుల్లో ఆదేశాలు జారీ చేయనున్నామని ప్రకటించారు. గ్రామాలలో పడిపోయిన పాత ఇంటి స్థానంలో అక్కడే కొత్త ఇళ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేస్తామన్నారు. గ్రామాల్లో శ్రమదానం చేసిన మహిళ సంఘాలకు 50వేళా నుంచి 3 లక్షల వారు మిత్తి లేని రుణాలు అందజేయనున్నట్టు ప్రకటించారు.......byte
బైట్
ఎర్రబెల్లి దయాకరరావు,
పంచాయత్ రాజ్ శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.