ETV Bharat / state

సీఎం రైతులను హీనంగా చూస్తున్నారు: చాడ

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను హీనంగా చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్​లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు.

author img

By

Published : Sep 6, 2019, 8:33 PM IST

చాడ వెంకట్​ రెడ్డి

ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వకుండా.. అన్నదాతలను జైల్లో పెట్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి మండిపడ్డారు. మహబూబ్​నగర్​లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. భూసేకరణకు సంబంధించి ఎక్కడెక్కడ ఎంత పరిహారం చెల్లించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుడికిళ్లలో రైతులపై పోలీసుల దాడి అమానుషమైన చర్యగా అభివర్ణించారు. యురేనియం తవ్వకాలపై కేసీఆర్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపితే అగ్నిగుండమే అవుతుందని హెచ్చరించారు.

సీఎం రైతులను హీనంగా చూస్తున్నారు: చాడ

ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్​లో నలుగురు దొంగల అరెస్ట్

ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వకుండా.. అన్నదాతలను జైల్లో పెట్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి మండిపడ్డారు. మహబూబ్​నగర్​లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. భూసేకరణకు సంబంధించి ఎక్కడెక్కడ ఎంత పరిహారం చెల్లించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుడికిళ్లలో రైతులపై పోలీసుల దాడి అమానుషమైన చర్యగా అభివర్ణించారు. యురేనియం తవ్వకాలపై కేసీఆర్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపితే అగ్నిగుండమే అవుతుందని హెచ్చరించారు.

సీఎం రైతులను హీనంగా చూస్తున్నారు: చాడ

ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్​లో నలుగురు దొంగల అరెస్ట్

Intro:TG_Mbnr_03_06_Chada_On_KCR_AVB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) యురేనియం తవ్వకాలపై కేసీఆర్ వైఖరి ఏంటో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపితే అగ్నిగుండమే అవుతుందని హెచ్చరించారు.


Body:మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను హీనంగా చూస్తున్నారని ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం ఇవ్వకపోడమే కాకుండా జైల్లో పెట్టిస్తున్నారని మండిపడ్డారు. భూసేకరణకు సంబంధించి ఎక్కడెక్కడ ఎంత పరిహారం చెల్లించారో ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కుడికిళ్ల లో రైతుల పై పోలీసులు జరిపిన దాడి అమానుషమని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు పది లక్షలు చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.


Conclusion:రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల హక్కులను హరిస్తుందని, అధికారులను, ప్రజాప్రతినిధులను మానసిక వేదనకు గురి చేస్తున్నారుని ఆయన అన్నారు. ఎలాంటి చర్చలు జరపకుండా ఆమోదించి తీసుకువచ్చిన పంచాయతీ రాజ్ చట్టం వివాదాస్పదమవుతోంది అన్నారు. కేసీఆర్ పుణ్యమా అని గ్రామాలలో కూడా నామినేటెడ్ పదవులు వచ్చాయని చమత్కరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎసెఫ్ జాతీయ కార్యదర్శి విక్కి మహేశ్వరి పాల్గొన్నారు.......byte
బైట్
చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.