తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు సీనియర్ నేతలు రాజీనామా చేశారు. పీసీసీ ఓబీసీ సెల్ ఛైర్మన్ మాజీమంత్రి చిత్తరంజన్ దాస్, రాజ్యసభ మాజీసభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ హస్తం పార్టీని వీడారు. కాంగ్రెస్లో తగిన గుర్తింపు లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులే పదవులు అనుభవిస్తున్నారని... వెనుకబడిన వర్గాలకు చెందినవారిని విస్మరిస్తున్నారని వారు ఆరోపించారు.