ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పోలీసు అధికారులకు ఫైరింగ్ శిక్షణ కోసం జడ్చర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ను ఎస్పీ రేమా రాజేశ్వరి పూజలు చేసి ప్రారంభించారు. గతంలో కోయిలకొండ ప్రాంతంలో శిక్షణ ఇచ్చేవారు. దీని వల్ల ఏర్పాట్లలో చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి.
వాటిని అధిగమించేందుకు జిల్లా పోలీస్ కేంద్రంలోనే ఫైరింగ్ రేంజ్ను ఏర్పాటు చేయాలని ఎస్పీ నిర్ణయించారు. ఈ శిక్షణ పోలీసులు నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీటీసీ ప్రిన్సిపల్ భాస్కరరావు, డీఎస్పీ సాయి మనోహర్, ఎస్సైలు పాల్గొన్నారు.