ETV Bharat / state

'అభివృద్ధి పథకాలే గెలిపించాయి'

author img

By

Published : Mar 21, 2021, 7:37 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపుని పురస్కరించుకుని ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. పల్లా విజయంతో మహబూబాబాద్ జిల్లాలో ఆనందంలో మునిగిపోయారు.

trs party leaders are celebrating mlc victory in mahabubabad district
తెరాసతోనే అభివృద్ధి సాధ్యం: తెరాస శ్రేణులు

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందడాన్ని హర్షిస్తూ తెరాస శ్రేణులు సంబురాలు జరిపారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి, కుమ్మరికుంట్ల గ్రామాల్లో రంగులు చల్లుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.

అనంతరం బాణా సంచా కాల్చి తెరాసకు మద్దతుగా నినాదాలు చేస్తూ.. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అమలు పరుస్తోన్న వివిధ రకాల అభివృద్ధి పథకాలను చూసే పట్టభద్రులు తెరాసకు రెండో సారి పట్టం కట్టారన్నారు. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని వివరించారు.

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందడాన్ని హర్షిస్తూ తెరాస శ్రేణులు సంబురాలు జరిపారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి, కుమ్మరికుంట్ల గ్రామాల్లో రంగులు చల్లుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.

అనంతరం బాణా సంచా కాల్చి తెరాసకు మద్దతుగా నినాదాలు చేస్తూ.. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అమలు పరుస్తోన్న వివిధ రకాల అభివృద్ధి పథకాలను చూసే పట్టభద్రులు తెరాసకు రెండో సారి పట్టం కట్టారన్నారు. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని వివరించారు.

ఇదీ చదవండి: ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేందుకు ఈసీ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.