ETV Bharat / state

మహబూబాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన ప్రజా రవాణా

author img

By

Published : May 19, 2020, 2:29 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు... రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్​ జిల్లాలో ఉదయం 6 గంటల నుంచే వివిధ రూట్లకు బస్సులు బయల్దేరాయి. ​

mahabubabad district latest news
mahabubabad district latest news

మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. డిపో నుంచి ఉదయం 6 గంటలకే బస్సులు వివిధ రూట్లకు బయల్దేరాయి. లాక్​డౌన్​ నిబంధనల మేరకు అధికారులు బస్సులను డిపోలోనే శానిటైజ్​ చేసి పంపిస్తున్నారు. విధుల్లో చేరే సిబ్బంది సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, చేతులను శుభ్రం చేసుకున్న తర్వాత డ్యూటీలో చేరే విధంగా డిపోలో అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 7 గంటల లోపు బస్సులు తిరిగి డిపోకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు డీఎం మహేశ్​ తెలిపారు. హైదరాబాద్ వెళ్లే బస్సులు ఉప్పల్ రింగ్ రోడ్ వరకే నడుస్తాయని అన్నారు. ప్రయాణికులంతా మాస్కులు ధరించి , సామాజిక దారం పాటిస్తూ బస్సులోకి ఎక్కాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ట్రిప్​కు సిబ్బందితోపాటు బస్సును శానిటైజ్ చేయిస్తున్నామన్నారు. ఈరోజు 50 శాతం బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుండి ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులను నడుపుతామని చెప్పారు.

మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. డిపో నుంచి ఉదయం 6 గంటలకే బస్సులు వివిధ రూట్లకు బయల్దేరాయి. లాక్​డౌన్​ నిబంధనల మేరకు అధికారులు బస్సులను డిపోలోనే శానిటైజ్​ చేసి పంపిస్తున్నారు. విధుల్లో చేరే సిబ్బంది సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, చేతులను శుభ్రం చేసుకున్న తర్వాత డ్యూటీలో చేరే విధంగా డిపోలో అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 7 గంటల లోపు బస్సులు తిరిగి డిపోకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు డీఎం మహేశ్​ తెలిపారు. హైదరాబాద్ వెళ్లే బస్సులు ఉప్పల్ రింగ్ రోడ్ వరకే నడుస్తాయని అన్నారు. ప్రయాణికులంతా మాస్కులు ధరించి , సామాజిక దారం పాటిస్తూ బస్సులోకి ఎక్కాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ట్రిప్​కు సిబ్బందితోపాటు బస్సును శానిటైజ్ చేయిస్తున్నామన్నారు. ఈరోజు 50 శాతం బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుండి ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులను నడుపుతామని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.