ETV Bharat / state

అకాల వర్షం ... తడిసిన ధాన్యం - తడిసిన వరి ధాన్యం

మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోయాయి. పెద్ద ఎత్తున నీరు నిల్వటం వల్ల కుప్పలు మునిగిపోయాయి. కొన్ని చోట్ల వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది.

Rain-stained rice grain in Mahabubabad district
కురిసిన మేఘం... తడిసిన ధాన్యం
author img

By

Published : Apr 29, 2020, 10:12 AM IST

మహబూబాబాద్​ జిల్లాలోని నెల్లికుదురు, కేసముద్రం, గార్ల మండలాల్లో మంగళవారం రాత్రి ఓ మోస్తారు వర్షం కురిసింది. వర్షపు నీరు కొనుగోలు కేంద్రాల్లోకి చేరటం వల్ల ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం, మొక్కజొన్నల కుప్పలపై టార్పాలిన్లు కప్పినా ప్రయోజనం లేకుండాపోయింది. తడిసిన ధాన్యం పరిస్థితి ఏంటని పలువురు అన్నదాతలు ప్రశ్నించారు.

మహబూబాబాద్​ జిల్లాలోని నెల్లికుదురు, కేసముద్రం, గార్ల మండలాల్లో మంగళవారం రాత్రి ఓ మోస్తారు వర్షం కురిసింది. వర్షపు నీరు కొనుగోలు కేంద్రాల్లోకి చేరటం వల్ల ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం, మొక్కజొన్నల కుప్పలపై టార్పాలిన్లు కప్పినా ప్రయోజనం లేకుండాపోయింది. తడిసిన ధాన్యం పరిస్థితి ఏంటని పలువురు అన్నదాతలు ప్రశ్నించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.