ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలను పొందిన వారు కేకులు కట్ చేయడం, ఫ్లెక్సీలు పెట్టడం కాకుండా.. ముఖ్యమంత్రికి చిరకాలం గుర్తుండేలా ప్రతిఒక్కరూ ఒక మొక్క నాటి.. కేసీఆర్ రుణం తీర్చుకోవాలన్నారు.
ఇదీ చూడండి: ప్రపంచానికి యోగా నేర్పించనున్న భారతీయుడు!