ETV Bharat / state

ఓరుగల్లులో 1537 పురపాలక నామినేషన్లు - mahabubabad municipal elections 2020

ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని 10 పురపాలికల్లో మొత్తం 1537 నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీల అభ్యర్థులు డప్పుచప్పుళ్లతో భారీ ర్యాలీగా నామినేషఖన్​ కేంద్రాలకు తరలివచ్చారు.

municipal nominations in mahabubabad district
ఓరుగల్లులో 1537 పురపాలక నామినేషన్లు
author img

By

Published : Jan 11, 2020, 1:40 PM IST

ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 పురపాలికల్లో మొత్తం 1537 నామపత్రాలు దాఖలయ్యాయి. వరంగల్​ గ్రామీణ జిల్లాలో మొత్తం 384 నామినేషన్లు రాగా... పరకాల పురపాలికలో 120, నర్సంపేట 162, వర్ధన్నపేట మున్సిపాలిటీలో 102 మంది అభ్యర్థులు రిటర్నింగ్​ అధికారికి నామపత్రాలు సమర్పించారు.

మహబూబాబాద్​ జిల్లాలో మొత్తం 602 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబాబాద్​ పురపాలికలో 261, డోర్నకల్​ 120, మరిపెడలో 94, తొర్రూరులో 127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

జయశంకర్​ భూపాలపల్లి మున్సిపాలిటీలో 289 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. జనగామ పురపాలికలో 262 నామినేషన్లు దాఖలయ్యాయి.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ర్యాలీలను 100 మీటర్ల దూరంలోనే నిలిపి వేశారు. పోటీ చేసే అభ్యర్థి తో పాటు... మరో ఇద్దరు వ్యక్తులను మాత్రమే లోనికి అనుమతించారు.

ఓరుగల్లులో 1537 పురపాలక నామినేషన్లు

ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 పురపాలికల్లో మొత్తం 1537 నామపత్రాలు దాఖలయ్యాయి. వరంగల్​ గ్రామీణ జిల్లాలో మొత్తం 384 నామినేషన్లు రాగా... పరకాల పురపాలికలో 120, నర్సంపేట 162, వర్ధన్నపేట మున్సిపాలిటీలో 102 మంది అభ్యర్థులు రిటర్నింగ్​ అధికారికి నామపత్రాలు సమర్పించారు.

మహబూబాబాద్​ జిల్లాలో మొత్తం 602 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబాబాద్​ పురపాలికలో 261, డోర్నకల్​ 120, మరిపెడలో 94, తొర్రూరులో 127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

జయశంకర్​ భూపాలపల్లి మున్సిపాలిటీలో 289 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. జనగామ పురపాలికలో 262 నామినేషన్లు దాఖలయ్యాయి.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ర్యాలీలను 100 మీటర్ల దూరంలోనే నిలిపి వేశారు. పోటీ చేసే అభ్యర్థి తో పాటు... మరో ఇద్దరు వ్యక్తులను మాత్రమే లోనికి అనుమతించారు.

ఓరుగల్లులో 1537 పురపాలక నామినేషన్లు
Intro:tg_wgl_62_10_mugisina_nominations_av_ts10070
nitheesh, janagama, 8978753177

జనగామ జిల్లా పురపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది.. వివిధ పార్టీల నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున నామినేషన్ పత్రాలను సమర్పించారు. మూడవ రోజు మొత్తం 30 వార్డులకు గాను 211మంది అభ్యర్థులు 262 నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అత్యధికంగా తెరాస నుంచి 99, కాంగ్రెస్ నుంచి 75, భాజపా నుంచి 36, సీపీఎం నుంచి 03, సీపీఐ నుంచి 03, తెదేపా నుంచి 10, స్వతంత్ర అభ్యర్ధులుగా 36 మంది నామినేషన్ పత్రాలను అందజేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి ప్రేమలత రెడ్డి 18వ వార్డ్ నుంచి నిన్న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఈ రోజు భాజపా నుంచి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల పరిశీలన అధికారి బాధవత్ సంతోష్ నామినేషన్ ప్రక్రియ ను పరిశీలించారు. తెరాస జనగామ నియోజకవర్గ ఇంచార్జి సంపత్ రెడ్డి తమ పార్టీ ఏ-ఫార్మ్ ఎన్నికల అధికారులకు అందజేశారు.
బైట్: గాడిపల్లి ప్రేమలత రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్


Body:1


Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.