ETV Bharat / state

నీరివ్వాలని ఖాళీ కుండలతో నిరసన

తమ కాలనీలకు నీరందించాలంటూ మహబూబాబాద్​లో ఖాళీ కుండలతో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

author img

By

Published : Jun 3, 2019, 4:54 PM IST

ఖాళీ కుండలతో నిరసన

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శివారు కాలనీలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ఖాళీ కుండలతో నిరసన దీక్ష చేపట్టారు. పట్టణంలోని సుమారు వందకు పైగా కాలనీలకు మంచినీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా నాయకుడు అజయ్ సారధి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇంటింటికి మంచినీరు అందిస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మంచినీరు అందించని పక్షంలో, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఖాళీ కుండలతో నిరసన

ఇవీ చూడండి: రైతుబంధు పథకానికి నిధులు విడుదల

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శివారు కాలనీలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ఖాళీ కుండలతో నిరసన దీక్ష చేపట్టారు. పట్టణంలోని సుమారు వందకు పైగా కాలనీలకు మంచినీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా నాయకుడు అజయ్ సారధి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇంటింటికి మంచినీరు అందిస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మంచినీరు అందించని పక్షంలో, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఖాళీ కుండలతో నిరసన

ఇవీ చూడండి: రైతుబంధు పథకానికి నిధులు విడుదల

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.