ETV Bharat / state

మృతదేహాన్ని మోసుకుంటూ వాగు దాటారు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన దాగే పోచన్న కుమారుడు ప్రభుదాస్ ఇవా ళ ఉదయం కరీంనగర్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లెందుకు సుమారు 2 కిలో మీటర్ల దూరం వాగులో మోసుకుంటూ వెళ్లారు.

author img

By

Published : Aug 15, 2019, 7:48 PM IST

మృతదేహాన్ని మోసుకుంటూ వాగు దాటారు..!

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన దాగే పోచన్న కుమారుడు ప్రభుదాస్ గత కొద్ది రోజులుగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రభుదాస్ ఈరోజు ఉదయం 4 గంటలకు మృతి చెందాడు. ప్రభుదాస్​ తల్లితండ్రులు కుమారుడి మృతదేహాన్ని అంబులెన్స్​లో తీసుకుని స్వగ్రామానికి బయలుదేరారు . దిందా గ్రామానికి ముందు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగు ఇటీవల వర్షాలకు ఉప్పొంగడం వల్ల అంబులెన్స్ వాగును దాటలేని పరిస్థితి నెలకొంది. ఆ తల్లి తండ్రులు చేసేదేమీ లేక బంధువుల సహాయంతో మృతదేహాన్ని మోసుకుంటూ వాగు దాటించారు.

మృతదేహాన్ని మోసుకుంటూ వాగు దాటారు..!

ఇదీ చూడండి : కుమురం భీం జిల్లాలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన దాగే పోచన్న కుమారుడు ప్రభుదాస్ గత కొద్ది రోజులుగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రభుదాస్ ఈరోజు ఉదయం 4 గంటలకు మృతి చెందాడు. ప్రభుదాస్​ తల్లితండ్రులు కుమారుడి మృతదేహాన్ని అంబులెన్స్​లో తీసుకుని స్వగ్రామానికి బయలుదేరారు . దిందా గ్రామానికి ముందు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగు ఇటీవల వర్షాలకు ఉప్పొంగడం వల్ల అంబులెన్స్ వాగును దాటలేని పరిస్థితి నెలకొంది. ఆ తల్లి తండ్రులు చేసేదేమీ లేక బంధువుల సహాయంతో మృతదేహాన్ని మోసుకుంటూ వాగు దాటించారు.

మృతదేహాన్ని మోసుకుంటూ వాగు దాటారు..!

ఇదీ చూడండి : కుమురం భీం జిల్లాలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Intro:Filename

Tg_adb_18_15_uppongina_vaagu_mruthadehanni_mosukellina_kutimbikulu_av_ts10034Body:కుమురం భీం జిల్లా
చింతలమనేపల్లి మండలం
------------------

కుమురం భీం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగుతున్న వాగులు, వంకలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన దాగే పొచ్చన్న కుమారుడు ప్రభుదాస్ గత కొద్ది రోజులుగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. నాలుగురోజుల క్రిందట మెరుగైన వైద్యం అందించటంకోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభుదాస్ ఈరోజు ఉదయం 4గంటల సమయంలో మృతి చెందాడు. కరీంనగర్ ఆసుపత్రిలో మృతిచెందిన కుమారుడి మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్ లో స్వగ్రామానికి బయలుదేరారు తల్లితండ్రులు. దిందా గ్రామానికి ముందు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగు ఇటీవల కురిసిన వర్షాలకు ఉప్పొంగడంతో అంబులెన్స్ వాగు దాటలేని పరిస్థితి నెలకొంది. అసలే కుమారుడు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లి తండ్రులు చేసేదేమీ లేక బంధువుల సహాయంతో మృతదేహాన్ని మోసుకుంటు వాగు దాటించారు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.