ETV Bharat / state

ఈస్గాం శివమల్లన్న ఆలయంలో చోరీ - కుమురం భీం ఆసిఫాబాద్  జిల్లాలోని ఈస్గాం శివమల్లన్న స్వామి ఆలయంలో చోరీ

లాక్​డౌన్ సమయంలో కుమురం భీం ఆసిఫాబాద్  జిల్లాలోని ఈస్గాం శివమల్లన్న స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు మొత్తం మూడు హుండీలను, ఒక సీసీ కెమెరాను ధ్వంసం చేశారు.

THEFTED IN ISGAM SHIVA MALLANNA SWAMY
ఈస్గాం శివమల్లన్న ఆలయంలో చోరీ
author img

By

Published : May 2, 2020, 12:05 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈస్గాం శివమల్లన్న స్వామి ఆలయంలో చోరీ జరిగింది. లాక్​డౌన్ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా శివమల్లన్న స్వామి ఆలయం మూసి ఉంటోంది. ఇదే అదునుగా చేసుకున్న దుండగులు ఆలయం తాళాలు పగులగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించారు.

ఆలయంలోని మూడు హుండీలను, ఒక సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. ఆలయానికి కాపలాగా ఉండే వాచ్ మెన్ ఉదయం లేచేసరికి గర్భగుడి తలుపులు తెరుచుకుని, ఆలయ హుండీలు పగులగొట్టి ఉన్నాయని ఆలయ ఈ ఓ, ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈస్గాం శివమల్లన్న స్వామి ఆలయంలో చోరీ జరిగింది. లాక్​డౌన్ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా శివమల్లన్న స్వామి ఆలయం మూసి ఉంటోంది. ఇదే అదునుగా చేసుకున్న దుండగులు ఆలయం తాళాలు పగులగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించారు.

ఆలయంలోని మూడు హుండీలను, ఒక సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. ఆలయానికి కాపలాగా ఉండే వాచ్ మెన్ ఉదయం లేచేసరికి గర్భగుడి తలుపులు తెరుచుకుని, ఆలయ హుండీలు పగులగొట్టి ఉన్నాయని ఆలయ ఈ ఓ, ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.