కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ప్లాస్టిక్ నిషేదంపై ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ వనజా రెడ్డి, కమిషనర్ భట్టు తిరుపతి, కాగజ్ నగర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా మన నిత్యావసరాల దృష్ట్యా వాడుతున్న ప్లాస్టిక్ రాబోయే తరానికి పెను ముప్పుగా మారుతుందని అన్నారు. ప్లాస్టిక్ నిషేధం అనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలని.. మనం ఆచరించినప్పుడే ఎదుటివారికి చెప్పగలమని సూచించారు.
ఇదీ చూడండి : సైరా నర్సింహారెడ్డి చిత్రానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్