కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం రామ్ నాయక్ తండ-ఎల్లాపటార్ గ్రామాల మధ్యలో నవంబర్ 24న వివాహిత టేకు లక్ష్మిని ముగ్గురు వ్యక్తులు హత్యాచారం చేశారు. నిందితులు ఎల్లాపటార్కు చెందిన షేక్ ముఖ్దం, షేక్ బాబు, షాబుద్దీన్గా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన తర్వాత నాలుగు రోజులకు దిశ ఘటన జరిగినది. ఈ ఘటనకు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి కానీ మారుమూల ప్రాంతంలో జరిగిన టేకు లక్ష్మి ఘటన వెలుగులోకి రాకపోవడం ఎంతో శోచనీయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అగ్రవర్ణాలకు ఒక న్యాయమా.... దళిత వర్గాలకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు.
సత్వరమే న్యాయం కావాలి..
దిశకు ఎలాంటి న్యాయం చేశారో టేకు లక్ష్మీకి కూడా అలాంటి న్యాయం చేయాలంటూ ప్రజలు జైనూర్లో భారీ ఎత్తున బైఠాయించారు. టేకు లక్ష్మికి న్యాయం చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సత్యనారాయణ రంగ ప్రవేశం బాధిత కుటుంబానికి సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం.. కాపాడిన స్థానికులు