ETV Bharat / state

ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు - MLA koneru konappa government college in sirpur

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నియోజకవర్గంలోని ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు
author img

By

Published : Nov 4, 2019, 5:58 PM IST

ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థుల కోసం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎస్పీ మల్లారెడ్డి, ఐటీడీఏ పీవో ఆదిత్య, ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు హాజరయ్యారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చదువుల్లో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు

ఇదీ చదవండిః గుడ్డు కావాలీ... మధ్యాహ్న భోజనంలో "గుడ్డు గుటుక్కు"!

ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థుల కోసం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎస్పీ మల్లారెడ్డి, ఐటీడీఏ పీవో ఆదిత్య, ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు హాజరయ్యారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చదువుల్లో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు

ఇదీ చదవండిః గుడ్డు కావాలీ... మధ్యాహ్న భోజనంలో "గుడ్డు గుటుక్కు"!

Intro:filename

tg_adb_11_04_mla_konappa_madhyahna_bojanam_avb_ts10034


Body:కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం కార్యక్రమం ప్రారంభించారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా పాలనధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, ఎస్పీ మల్లారెడ్డి, ఐటిడిఎ పిఓ కృష్ణ ఆదిత్య, అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, తదితరులు హాజరయ్యారు. మొదట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని చదువుకునేందుకు కళాశాలలకు సుదూర ప్రాంతాలనుండి వస్తారని.. మధ్యాహ్నం పూట భోజనం లేకపోవడంతో చదువు పైన ఏకాగ్రత చూపలేకపోతున్నారనే విషయం తెలుసుకుని తాను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని తెలిపారు. ఐదు సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనం పెట్టిన తరువాత విద్యార్థుల చదువులో పురోగతి కనిపించి హాజరు శాతం, ఉత్తీర్ణత శాతం పెరిగడం తనకు సంతోషం కలిగించిందని అన్నారు. పాలనధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం ఖర్చుతో శ్రమతో కూడుకున్న పని అని, అయినా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం అని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని చదువుల్లో రాణించి ఉన్నత స్థానాలను ఎదగాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు విద్యార్థులతో భోజనం చేశారు.

బైట్:
ఎమ్మెల్యే : కోనేరు కోనప్ప
పాలనధికారి: రాజీవ్ గాంధీ హనుమంతు


Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.