కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఎస్పీఎం స్టాఫ్ గేట్ ఎదురుగా గణేషుని మండపం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు గణపతిని ప్రతిష్టించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పరిశ్రమ తెరుచుకుని కార్మికులకు మంచి జరగాలని కోరుతూ మూడేళ్లుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లంబోదరుడిని నిలిపి పూజలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమ తెరుచుకున్నందున ఈ సంవత్సరం ఫ్యాక్టరీ ప్రతినిధుల ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు.
ఇదీ చదవండిః 'విక్రమ్' తొలి కక్ష్య విజయవంతంగా తగ్గింపు