కుమురం భీం జిల్లాలో నిన్న తేలికపాటి వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తుండటంతో చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. వరి ధాన్యం పై పై టార్ఫాలిన్లు కప్పి వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తేలికపాటి వర్షం కాబట్టి టార్ఫాలిన్లతో కాపాడుకున్నామని... భారీ వర్షం వస్తే మాత్రం తమ పంట మొత్తం నీటి పాలయ్యేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: వికారాబాద్లో దారుణం..