ETV Bharat / state

ఆబ్కారీ అధికారుల సోదాలు... భారీగా మద్యం లభ్యం - LOCK DOWN EFFECTS

లాక్​డౌన్​ వేళ కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న స్థావరాలపై ఆబ్కారీ పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు రూ.50 వేల విలువ గల మద్యం స్వాధీనపర్చుకోగా... ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

EXCISE POLICE RAIDS IN KUMURAM BHEEM DISTRICT
అబ్కారీ అధికారుల సోదాలు... భారీగా మద్యం లభ్యం
author img

By

Published : Apr 29, 2020, 4:49 PM IST

కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలంలో ఆబ్కారీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ. 50వేల విలువ గల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పెంచికలపేట మండలంలో పలు చోట్ల అక్రమ మద్యం నిల్వలు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు.

డబ్బుల రంగయ్య, చంద్రశేఖర్ వద్ద 345 మద్యం సీసాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం నమోదైన మధ్యప్రదేశ్ మద్యం కేసులో ఆబ్కారీ శాఖపై కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి హరీశ్​బాబు చేసిన ఆరోపణలను అధికారులు ఖండించారు.

ఇవీచూడండి: రోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు

కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలంలో ఆబ్కారీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ. 50వేల విలువ గల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పెంచికలపేట మండలంలో పలు చోట్ల అక్రమ మద్యం నిల్వలు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు.

డబ్బుల రంగయ్య, చంద్రశేఖర్ వద్ద 345 మద్యం సీసాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం నమోదైన మధ్యప్రదేశ్ మద్యం కేసులో ఆబ్కారీ శాఖపై కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి హరీశ్​బాబు చేసిన ఆరోపణలను అధికారులు ఖండించారు.

ఇవీచూడండి: రోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.