ETV Bharat / state

జిల్లా సరిహద్దుల్లో చెక్​పోస్టులు.. నిరంతరం పర్యవేక్షణ - తెలంగాణ వార్తలు

కొవిడ్​ కట్టడి చర్యల్లో భాగంగా పోలీసులు ఎక్కడికక్కడ చెక్​పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. కుమురం భీం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలను నియంత్రిస్తున్నారు. అకారణంగా వచ్చేవారిని తిప్పి పంపిస్తున్నారు.

Check posts, Kumaram Bheem district boundaries, kagaz nagar news
Check posts, Kumaram Bheem district boundaries, kagaz nagar news
author img

By

Published : May 15, 2021, 7:40 PM IST

లాక్​డౌన్​ అమలులో భాగంగా పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కుమురం భీం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

కాగజ్ నగర్ డివిజన్ పరిధిలోని సిర్పూర్(టి), చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల మీదుగా మహారాష్ట్ర వాసులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ప్రస్తుతం లాక్​డౌన్ సమయంలోనూ వివిధ కారణాలతో వారు తెలంగాణకు వస్తున్నారు. అలాంటి వారిని నియంత్రించేందుకు అధికారులు ఆయా ప్రాంతాల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు.

సిర్పూర్(టి) మండలంలోని మాకిడి, జక్కాపూర్, వెంకట్రావ్ పేట్, పోడ్సా, చింతలమానేపల్లి మండల కేంద్రంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా వైద్యం కోసం వస్తే అన్ని ఆధారాలు పరిశీలించాకే అనుమతిస్తున్నారు. నిత్యావసరాలు, మెడికల్, అత్యవసర సేవలు మినహా అకారణంగా వచ్చేవారిని వెనక్కి పంపిస్తున్నారు. చెక్​పోస్టుల వద్ద పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యం వల్లే "నిండుచూలాలు" మృతి'

లాక్​డౌన్​ అమలులో భాగంగా పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కుమురం భీం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

కాగజ్ నగర్ డివిజన్ పరిధిలోని సిర్పూర్(టి), చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల మీదుగా మహారాష్ట్ర వాసులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ప్రస్తుతం లాక్​డౌన్ సమయంలోనూ వివిధ కారణాలతో వారు తెలంగాణకు వస్తున్నారు. అలాంటి వారిని నియంత్రించేందుకు అధికారులు ఆయా ప్రాంతాల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు.

సిర్పూర్(టి) మండలంలోని మాకిడి, జక్కాపూర్, వెంకట్రావ్ పేట్, పోడ్సా, చింతలమానేపల్లి మండల కేంద్రంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా వైద్యం కోసం వస్తే అన్ని ఆధారాలు పరిశీలించాకే అనుమతిస్తున్నారు. నిత్యావసరాలు, మెడికల్, అత్యవసర సేవలు మినహా అకారణంగా వచ్చేవారిని వెనక్కి పంపిస్తున్నారు. చెక్​పోస్టుల వద్ద పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యం వల్లే "నిండుచూలాలు" మృతి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.