ETV Bharat / state

మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్ష... అనంతరం కుటుంబసభ్యులకు అప్పగింత

author img

By

Published : Sep 20, 2020, 9:43 PM IST

కడంబ అటవీప్రాంతంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు సిర్పూర్​ (టి) మండలంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.

Autopsy on Maoist bodies in kumurambheem asifabad district
మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్ష... అనంతరం కుటుంబసభ్యులకు అప్పగింత

శనివారం రాత్రి కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ మండలం కడంబ అటవీప్రాంతంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు సిర్పూర్​ (టి) మండలంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సిద్ధం చేశారు.
ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండకు చెందిన మావోయిస్టు బాజిరావు మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. చత్తీస్​గఢ్​ బీజాపూర్​కు చెందిన మరో మావోయిస్టు చుక్కాలు మృతదేహం కోసం కుటుంబసభ్యులు ఎవరూ రాలేదు. చుక్కాలు మృతదేహాన్ని సిర్పూర్ సామాజిక ఆసుపత్రిలోని మార్చురీలో మూడు రోజులపాటు ఉంచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈలోపు ఎవరైనా వస్తే వారికి అప్పగిస్తామని తెలిపారు.

శనివారం రాత్రి కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ మండలం కడంబ అటవీప్రాంతంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు సిర్పూర్​ (టి) మండలంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సిద్ధం చేశారు.
ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండకు చెందిన మావోయిస్టు బాజిరావు మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. చత్తీస్​గఢ్​ బీజాపూర్​కు చెందిన మరో మావోయిస్టు చుక్కాలు మృతదేహం కోసం కుటుంబసభ్యులు ఎవరూ రాలేదు. చుక్కాలు మృతదేహాన్ని సిర్పూర్ సామాజిక ఆసుపత్రిలోని మార్చురీలో మూడు రోజులపాటు ఉంచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈలోపు ఎవరైనా వస్తే వారికి అప్పగిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి: కడంబా అడవుల్లో కూంబింగ్​... మావోయిస్టు కీలక నేత కోసం గాలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.