ETV Bharat / state

పరిశ్రమలో ప్రమాదం ఎలా జరిగింది.. కారకులెవరు? - కాగజ్​నగర్​ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు

రోజువారీ విధుల్లో భాగంగా అందరూ ఫ్యాక్టరీకెళ్లారు. సరదా కబుర్లతో పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే పెద్దశబ్ధం వినిపించింది. మట్టిపెల్లలు విరిగి పడ్డాయి. మట్టే.. కదా అని అందరూ అనుకునేలోపే.. పెద్దపెద్ద అరుపులు వినిపించాయి. లోపలికెళ్లి చూస్తే.. ఆ మట్టిలోనే ముగ్గురు కలిసిపోయారు. మరికొందరు ప్రాణాలతో భయటపడ్డారు. ఈ ఘోరానికి కారణం యాజమాన్యమా? లేక నిర్లక్ష్యమా?

PAPER MILL ACCIDENT IN KAGAZNAGAR
పరిశ్రమలో ప్రమాదం ఎలా జరిగింది.. కారకులెవరు?
author img

By

Published : Feb 23, 2020, 3:52 PM IST

Updated : Feb 23, 2020, 5:13 PM IST

పరిశ్రమలో ప్రమాదం ఎలా జరిగింది.. కారకులెవరు?

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్​లోని కాగితపు పరిశ్రమలో అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో విద్యుత్ ప్లాంట్ కోసం జరుగుతున్న బాయిలర్ నిర్మాణంలో ఒక్కసారిగా మట్టి పెల్లలు కూలిపడ్డాయి. దాంతో కింద పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతిచెందగా మరో అయిదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు జార్ఖండ్​కు చెందిన రఘునాథ్ రాం(38), చోటు బనియా(25), రంజిత్​లుగా గుర్తించారు. అదే రాష్ట్రానికి చెందిన రవిదాస్, సంతోష్ రాం, ఫనీఖాన్ రాం, రాం ప్రణీత్, సంజయ్ రాం గాయపడ్డారు.

పరిశ్రమలో ఒక్కో షిఫ్టులో సగటున పన్నెండు మంది కార్మికులు పనిచేయాల్సి ఉండగా... ప్రమాదం జరిగిన చోట తొమ్మిది మంది కార్మికులు విధులు నిర్వహించారని తేలింది. గాయపడిన కార్మికులంతా మట్టికుప్పల్లో చిక్కుకుని ఉండడం వల్ల ప్రత్యేక జేసీబీల ద్వారా బయటకు తీసే ప్రయత్నం చేశారు. నిన్నరాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకూ మృతులు, క్షతగాత్రులను బయటకు తీసి మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

పనుల నిర్వహణలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు, కాగితపు పరిశ్రమ అధికారులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. కర్మాగారం పున: ప్రారంభమై ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు అంతా బయటి రాష్ట్రాలకు చెందినవారే!

ఇవీ చూడండి: గిరిజన సంక్షేమ బడ్జెట్‌పై మంత్రుల సమీక్ష

పరిశ్రమలో ప్రమాదం ఎలా జరిగింది.. కారకులెవరు?

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్​లోని కాగితపు పరిశ్రమలో అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో విద్యుత్ ప్లాంట్ కోసం జరుగుతున్న బాయిలర్ నిర్మాణంలో ఒక్కసారిగా మట్టి పెల్లలు కూలిపడ్డాయి. దాంతో కింద పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతిచెందగా మరో అయిదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు జార్ఖండ్​కు చెందిన రఘునాథ్ రాం(38), చోటు బనియా(25), రంజిత్​లుగా గుర్తించారు. అదే రాష్ట్రానికి చెందిన రవిదాస్, సంతోష్ రాం, ఫనీఖాన్ రాం, రాం ప్రణీత్, సంజయ్ రాం గాయపడ్డారు.

పరిశ్రమలో ఒక్కో షిఫ్టులో సగటున పన్నెండు మంది కార్మికులు పనిచేయాల్సి ఉండగా... ప్రమాదం జరిగిన చోట తొమ్మిది మంది కార్మికులు విధులు నిర్వహించారని తేలింది. గాయపడిన కార్మికులంతా మట్టికుప్పల్లో చిక్కుకుని ఉండడం వల్ల ప్రత్యేక జేసీబీల ద్వారా బయటకు తీసే ప్రయత్నం చేశారు. నిన్నరాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకూ మృతులు, క్షతగాత్రులను బయటకు తీసి మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

పనుల నిర్వహణలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు, కాగితపు పరిశ్రమ అధికారులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. కర్మాగారం పున: ప్రారంభమై ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు అంతా బయటి రాష్ట్రాలకు చెందినవారే!

ఇవీ చూడండి: గిరిజన సంక్షేమ బడ్జెట్‌పై మంత్రుల సమీక్ష

Last Updated : Feb 23, 2020, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.