ఖమ్మం జిల్లా కొత్తలంకపల్లిలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఆదివారం సాయంత్రం నితిన్... ఓ యువతిని స్థానిక గుట్టపైకి తీసుకెళ్లి హత్య చేశాడు. మృతురాలు కుప్పెనకుంట్లకు చెందిన తేజస్విని (20)గా పోలీసులు గుర్తించారు. యువతి అదృశ్యంపై నిన్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఆమె చరవాణి ఆధారంగా దర్యాప్తు చేశారు. యువతితో ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడిన నితిన్ను పోలీసులు ప్రశ్నించారు. విచారణలో నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఆదివారం యువతికి ఫోన్ చేసి గుట్టపైకి తీసుకెళ్లి... అక్కడే చేతి రుమాలుతో యువతిని హత్యచేశాడు.
ఇదీ చూడండి : వైద్యం వికటించి బాలుడి మృతి... ఆసుపత్రి ఎదుట ఆందోళన