వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉండే విధంగా సంక్షేమ పథకాలు రూపొందించిందన్నారు. ఈ పథకం నిరుపేదల కళ్లల్లో సంతోషాన్ని నింపుతుందన్నారు. ఆడపిల్లలకి వివాహంతో పాటు, ఈ పథకం ద్వారా బాల్యవివాహాలను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి : కాంగ్రెస్, భాజపా నాయకుల మధ్య తోపులాట