ETV Bharat / state

అక్టోబర్ 29 చరిత్రాత్మకమైన రోజు: పువ్వాడ అజయ్ - రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్

అక్టోబర్ 29 చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిన రోజు అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. పారదర్శకమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​దేనని చెప్పారు. కేసీఆర్ చేతుల మీదుగా సాగిన ధరణి పోర్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అధికారులతో కలిసి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో వీక్షించారు.

tranceport minister puvvada ajay kumar on dharani website in khammam district
అక్టోబర్ 29 చరిత్రాత్మకమైన రోజు: పువ్వాడ అజయ్
author img

By

Published : Oct 29, 2020, 5:52 PM IST

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సాగిన ధరణి పోర్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి అజయ్​ కుమార్​ రైతులు, అధికారులతో కలిసి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో వీక్షించారు. పారదర్శకమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​దేనని చెప్పారు. అక్టోబర్ 29న చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిన రోజని చెప్పారు.

ధరణి పోర్టల్ ప్రారంభంతో రైతులు ఇక నిబ్బరంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇక భవిష్యత్​లో ఏ రకమైన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అయినా.. తహసీల్దార్ కార్యాలయాల్లోనే జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిన ఈ పద్ధతితో అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పనులు జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి పోర్టల్ ప్రారంభోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సాగిన ధరణి పోర్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి అజయ్​ కుమార్​ రైతులు, అధికారులతో కలిసి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో వీక్షించారు. పారదర్శకమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​దేనని చెప్పారు. అక్టోబర్ 29న చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిన రోజని చెప్పారు.

ధరణి పోర్టల్ ప్రారంభంతో రైతులు ఇక నిబ్బరంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇక భవిష్యత్​లో ఏ రకమైన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అయినా.. తహసీల్దార్ కార్యాలయాల్లోనే జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిన ఈ పద్ధతితో అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పనులు జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి పోర్టల్ ప్రారంభోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఇదీ చదవండి: భాగ్యనగరం ఊపిరి పీల్చుకుంది వారి వల్లనే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.