ఖమ్మం జిల్లా మధిరలో శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. వేద పండితులు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ ఆలయంలో మహిళలు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
ఇదీ చదవండి: కిడ్నాప్ నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్య