ETV Bharat / state

డెంగీతో ఆరేళ్ల చిన్నారి మృతి - డెంగ్యూ జ్వరంతో ఆరేళ్ల చిన్నారి మృతి

వాతావరణంలో మార్పులతో ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. డెంగీ జ్వరాలతో మంచం పడుతున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్​గూడెంలో ఓ ఆరేళ్ల చిన్నారి డెంగ్యూ మహమ్మారికి బలయ్యాడు.

Six-year-old child dies of dengue fever
author img

By

Published : Sep 8, 2019, 10:44 PM IST

డెంగ్యూ జ్వరంతో ఆరేళ్ల చిన్నారి మృతి

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్​గూడెంలో డెంగీ జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. నాలుగు రోజుల నుంచి బాలుడు జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల కిందట ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్​కి తరలించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. డెంగీ జ్వరంగా వైద్యులు గుర్తించారని బంధువులు తెలిపారు. ఆడుతూ పాడుతూ తిరిగే తమ కొడుకు కళ్ల ముందు విగతజీవిగా మృతి చెందటంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇవీ చూడండి: రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేటీఆర్

డెంగ్యూ జ్వరంతో ఆరేళ్ల చిన్నారి మృతి

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్​గూడెంలో డెంగీ జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. నాలుగు రోజుల నుంచి బాలుడు జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల కిందట ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్​కి తరలించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. డెంగీ జ్వరంగా వైద్యులు గుర్తించారని బంధువులు తెలిపారు. ఆడుతూ పాడుతూ తిరిగే తమ కొడుకు కళ్ల ముందు విగతజీవిగా మృతి చెందటంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇవీ చూడండి: రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేటీఆర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.