దిల్లీ నుంచి వచ్చిన తమ పార్టీ పరిశీలకులు బస చేసిన హోటల్ గదుల్లో వారు లేని సమయంలో సోదాలు చేయటం ఎంతవరకు సమంజసమని ఖమ్మం లోక్సభ అభ్యర్థి రేణుకా చౌదరి ప్రశ్నించారు. గులాబీ నేతలు విచ్చల విడిగా నగదు పంపిణీ చేస్తున్న అధికారులు పట్టించుకోవటంలేదని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన మహిళల గదుల్లోకి వెళ్లి తనిఖీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కేసీఆర్.. ఇది మీకు న్యాయమా: విజయశాంతి