ETV Bharat / state

పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీ​

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మధిరలో పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల బృందం ఆకస్మికంగా సందర్శించింది. పోలింగ్​ కేంద్రాల్లో సౌకర్యాలపై ఆరా తీసింది.

author img

By

Published : Mar 29, 2019, 8:30 PM IST

పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీ​
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీ​
ఎన్నికలు సమీపిస్తున్నందున పోలింగ్​ కేంద్రాల్లోని ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల బృందం దృష్టి సారిచింది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మధిరలో పోలింగ్​ కేంద్రాలను ఈ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది.

ప్రత్యక్షంగా పరిశీలన

మధిర నియోజకవర్గంలో మొత్తం 2,10,358 మంది ఓటర్లున్నారు. వీరి కోసం మధిర, ముదిగొండ, చింతకాని, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో మొత్తం 255 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఓటర్లకోసం ఏర్పాటు చేసిన వసతులపై పరిశీలకుల బృంద సభ్యులు తనిఖీ చేశారు. వికలాంగులు, వృద్ధుల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఇతర ఏర్పాట్లపై తహసీల్దారు, రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: 'పార్టీ గుర్తేంటో తెలియని అభ్యర్థి నాపై పోటీయా'

పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీ​
ఎన్నికలు సమీపిస్తున్నందున పోలింగ్​ కేంద్రాల్లోని ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల బృందం దృష్టి సారిచింది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మధిరలో పోలింగ్​ కేంద్రాలను ఈ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది.

ప్రత్యక్షంగా పరిశీలన

మధిర నియోజకవర్గంలో మొత్తం 2,10,358 మంది ఓటర్లున్నారు. వీరి కోసం మధిర, ముదిగొండ, చింతకాని, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో మొత్తం 255 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఓటర్లకోసం ఏర్పాటు చేసిన వసతులపై పరిశీలకుల బృంద సభ్యులు తనిఖీ చేశారు. వికలాంగులు, వృద్ధుల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఇతర ఏర్పాట్లపై తహసీల్దారు, రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: 'పార్టీ గుర్తేంటో తెలియని అభ్యర్థి నాపై పోటీయా'

tg_wgl_62_29_komatireddy_pracharam_ab_c10
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.