ETV Bharat / state

'కరోనాపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలే'

author img

By

Published : May 20, 2020, 12:25 PM IST

Updated : May 20, 2020, 1:18 PM IST

కరోనా వైరస్​ కలవరపెడుతున్న వేళ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం, అసత్య ప్రచారం వెల్లువెత్తుతోంది. వివిధ రూపాల్లో తమ కొస్తున్న సందేశాల్లోని సారాంశం నిజమా? కాదా? అనేది నిర్ధారించుకోకుండానే చాలా మంది షేరు చేస్తున్నారు. కరోనా వైరస్​పై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మధిర సీఐ వేణు మాధవ్​ హెచ్చరించారు.

Police have been warned that Strict actions will be taken on false News in Social media campaigns on Corona
'కరోనాపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలే'

కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​లో భాగంగా సడలింపులు ఇవ్వటం వల్ల కొంత మంది వలస కూలీలు మహారాష్ట్ర నుంచి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా మధిర మండలం మహాదేవపురం గ్రామానికి వచ్చారు. వారిలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్​గా తేలింది. అప్రమత్తమైన పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సదరు వ్యక్తిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామానికి చెందిన మొత్తం 52 మందిని క్వారంటైన్​కు తరలించారు.

అయితే సామాజిక మాధ్యమాల ద్వారా కొంతమంది గ్రామంలో మొత్తం ఏడు, ఎనిమిది మందికి పైగా కరోనా సోకినట్లు... మధిర ప్రాంతాన్ని రెడ్ జోన్​గా చేసినట్లు దుష్ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న మధిర సీఐ వేణుమాధవ్, పట్టణ ఎస్సై ఉదయ్ కుమార్​తో గ్రామానికి వెళ్లి ఎవరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని మనోధైర్యం కల్పించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేసేవారిని చట్టరీత్యా శిక్షిస్తామని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​లో భాగంగా సడలింపులు ఇవ్వటం వల్ల కొంత మంది వలస కూలీలు మహారాష్ట్ర నుంచి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా మధిర మండలం మహాదేవపురం గ్రామానికి వచ్చారు. వారిలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్​గా తేలింది. అప్రమత్తమైన పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సదరు వ్యక్తిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామానికి చెందిన మొత్తం 52 మందిని క్వారంటైన్​కు తరలించారు.

అయితే సామాజిక మాధ్యమాల ద్వారా కొంతమంది గ్రామంలో మొత్తం ఏడు, ఎనిమిది మందికి పైగా కరోనా సోకినట్లు... మధిర ప్రాంతాన్ని రెడ్ జోన్​గా చేసినట్లు దుష్ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న మధిర సీఐ వేణుమాధవ్, పట్టణ ఎస్సై ఉదయ్ కుమార్​తో గ్రామానికి వెళ్లి ఎవరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని మనోధైర్యం కల్పించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేసేవారిని చట్టరీత్యా శిక్షిస్తామని హెచ్చరించారు.

Last Updated : May 20, 2020, 1:18 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.