కరోనా పరీక్షల కోసం వచ్చిన వారితో ఖమ్మం పాత బస్టాండు నిర్ధారణ కేంద్రం శుక్రవారం కిటకిటలాడింది. వైరస్ లక్షణాలతో వందలాది మంది తెల్లవారుజామునే వచ్చి గంటలకొద్ది వరుసల్లో నిరీక్షించి ఇబ్బందుల పాలయ్యారు. కొందరు ఎక్కువ సేపు నిలబడలేక చెప్పులను వరుసలో పెట్టి పక్కన కూర్చున్నారు.
టోకెన్లు, ఓపీ, పరీక్షలు.. ఇలా మూడు విభాగాల్లో జనం వరుసలు కట్టాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన వారెవరూ భౌతిక దూరం పాటించకపోవడంతో పోలీసులు లాఠీలు అడ్డుపెట్టి వారిని నిలువరించారు.
ఇదీ చదవండి: కొలువుదీరిన పురపాలక నూతన పాలకవర్గాలు