ETV Bharat / state

' రైతుల జోలికి అటవీ అధికారులు పోవద్దు'

author img

By

Published : Jun 16, 2021, 9:37 AM IST

అటవీ అధికారులు రైతుల జోలికి పోవద్దని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకుండా రైతులను అడ్డుకోవద్దని సూచించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని భూములను ఆమె పరిశీలించారు.

mla-haripriya
mla-haripriya

రైతులను ఇబ్బంది పెట్టకూడదని అటవీశాఖ అధికారులకు ఎమ్మెల్యే హరిప్రియ సూచించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో భూములను పరిశీలించారు. మద్దులపల్లి, జాస్తిపల్లి రెవెన్యూ సరిహద్దులో 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నించడం వల్ల కొంతకాలంగా ఉద్రిక్తత నెలకొంది. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే హరిప్రియ... ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకుండా రైతులను అడ్డుకోవద్దని స్పష్టం చేశారు. పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని అప్పటి వరకు రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.

రైతులను ఇబ్బంది పెట్టకూడదని అటవీశాఖ అధికారులకు ఎమ్మెల్యే హరిప్రియ సూచించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో భూములను పరిశీలించారు. మద్దులపల్లి, జాస్తిపల్లి రెవెన్యూ సరిహద్దులో 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నించడం వల్ల కొంతకాలంగా ఉద్రిక్తత నెలకొంది. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే హరిప్రియ... ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకుండా రైతులను అడ్డుకోవద్దని స్పష్టం చేశారు. పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని అప్పటి వరకు రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.

ఇదీ చదవండి: నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.