ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల్లో ప్రభుత్వం పురోగతి సాధించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో నిర్వహించిన నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల సన్నాహక సమావేశానికి... తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రతి కార్యకర్త పట్టభద్రులను చైతన్యపరిచి శాసనమండలి ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో విజయం సాధించేలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రైతువేదికలతో విప్లవాత్మక మార్పులు: జగదీశ్ రెడ్డి