ETV Bharat / state

సిద్దారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్

author img

By

Published : Nov 6, 2020, 6:03 PM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ప్రకృతి వనాన్ని,శ్మశాన వాటికను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ప్రజల మీద ఎలాంటి భారం పడకుండా.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు.

Minister Puvvada Ajay inaugurated the grain purchasing center at Siddaram
సిద్దారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్

ఖమ్మం జిల్లాలో పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో అత్యధికంగా వరి సాగవుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సిద్దారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ప్రకృతి వనాన్ని,శ్మశాన వాటికను మంత్రి.. ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ప్రారంభించారు. ఖరీఫ్ లో పండిన ధాన్యాన్ని దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడి మిల్లర్లే కొనుగోలు చేస్తారన్నారు. ఈసారి రాష్ట్రంలో గన్ని సంచుల కొరత లేదన్నారు. మరో 30 లక్షల వరకు టెండర్ దాఖలు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో వేల కోట్లు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులు రాష్ట్రంలో అమలు కావని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిలో సత్తుపల్లి నియోజకవర్గం అగ్రగామిగా ఉందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. జాతీయ రహదారి మరమ్మతులకు 25 కోట్లు నిధులు మంజూరయ్యాయని సండ్ర వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సర్పంచి, ఎమ్మెల్సీ, డీసీఎంఎస్ చైర్మన్, సొసైటీ చైర్మన్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: గంగుల శ్రీనివాస్​ మృతికి భాజపా నిరసన.. అడ్డుకున్న పోలీసులు

ఖమ్మం జిల్లాలో పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో అత్యధికంగా వరి సాగవుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సిద్దారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ప్రకృతి వనాన్ని,శ్మశాన వాటికను మంత్రి.. ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ప్రారంభించారు. ఖరీఫ్ లో పండిన ధాన్యాన్ని దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడి మిల్లర్లే కొనుగోలు చేస్తారన్నారు. ఈసారి రాష్ట్రంలో గన్ని సంచుల కొరత లేదన్నారు. మరో 30 లక్షల వరకు టెండర్ దాఖలు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో వేల కోట్లు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులు రాష్ట్రంలో అమలు కావని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిలో సత్తుపల్లి నియోజకవర్గం అగ్రగామిగా ఉందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. జాతీయ రహదారి మరమ్మతులకు 25 కోట్లు నిధులు మంజూరయ్యాయని సండ్ర వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సర్పంచి, ఎమ్మెల్సీ, డీసీఎంఎస్ చైర్మన్, సొసైటీ చైర్మన్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: గంగుల శ్రీనివాస్​ మృతికి భాజపా నిరసన.. అడ్డుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.