రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తే మిగతా పార్టీల సభ్యులు ఆసక్తిగా గమనిస్తున్నారని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పర్యటించారు. ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు.. చీరలు పంపిణీ చేశారు. ఈ ఏడాదిలోనే రూ.5 కోట్ల వరకు చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే సండ్ర కృషిచేస్తున్నారని.. ఎంపీ నామ ప్రశంసించారు. ఆ గుర్తింపుతోనే.. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించినట్లు చెప్పారు.
కరోనా సమయంలో.. రైతులను ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ను కోరినట్లు పేర్కొన్నారు. మల్లవరం గ్రామంలో ఓ బాధితుడికి రూ. 7.5 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అందించారు.
ఇవీచూడండి: ఏ రాష్ట్రంలో లేనివిధంగా దివ్యాంగులకు సంక్షేమ పథకాలు: కేటీఆర్