ETV Bharat / state

'కొవిడ్ కట్టడిలో డాక్టర్ రాజారావు సేవలు అభినందనీయం'

author img

By

Published : Dec 25, 2020, 9:44 PM IST

ఖమ్మం జిల్లా మధిరలో పురపాలక ఛైర్​పర్సన్​ లత అధ్యక్షతన గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్​ డాక్టర్​ రాజారావుకు ఘన సత్కారం చేశారు. కరోనా కట్టడిలో రాజారావు కృషి అభినందనీయమని నేతలు కొనియాడారు.

khammam leaders honored gandhi hospital superintendent rajarao in madhira
khammam leaders honored gandhi hospital superintendent rajarao in madhira

కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్​గా డాక్టర్ రాజారావు అందించిన సేవలు అభినందనీయమని ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు ప్రశంసించారు. డాక్టర్ రాజారావు స్వస్థలమైన ఖమ్మం జిల్లా మధిరలో పురపాలక ఛైర్​పర్సన్​ లత అధ్యక్షతన రాజారావుకు ఘన సత్కారం చేశారు.

మధ్యతరగతి కుటుంబంలో జన్మించి... వైద్యునిగా మెరుగైన సేవలు అందిస్తూ... రాష్ట్రానికే తలమానికమైన గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగిన రాజారావు ఎందరికో స్ఫూర్తి దాయకమన్నారు. అనంతరం రాజారావు దంపతులను నేతలు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగిశెట్టి కోటేశ్వర రావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 16 మందికి కరోనా

కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్​గా డాక్టర్ రాజారావు అందించిన సేవలు అభినందనీయమని ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు ప్రశంసించారు. డాక్టర్ రాజారావు స్వస్థలమైన ఖమ్మం జిల్లా మధిరలో పురపాలక ఛైర్​పర్సన్​ లత అధ్యక్షతన రాజారావుకు ఘన సత్కారం చేశారు.

మధ్యతరగతి కుటుంబంలో జన్మించి... వైద్యునిగా మెరుగైన సేవలు అందిస్తూ... రాష్ట్రానికే తలమానికమైన గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగిన రాజారావు ఎందరికో స్ఫూర్తి దాయకమన్నారు. అనంతరం రాజారావు దంపతులను నేతలు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగిశెట్టి కోటేశ్వర రావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 16 మందికి కరోనా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.