Mirchi rush at Khammam Market yard: ఖమ్మం మార్కెట్కు మిర్చి భారీగా తరలివచ్చింది. రెండు రోజుల తర్వాత మార్కెట్ తెరవటంతో అధిక సంఖ్యలో మిర్చిని రైతులు తీసుకొచ్చారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా జిల్లాల నుంచి రైతులు మిరపను తరలించారు.
![huge crowd of mirchi farmers to khammam market yard](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14466560_mirchi44.png)
మొదటి గంటలో మందకొడిగా ప్రారంభమైన కొనుగోళ్లు ఆ తర్వాత జోరందుకున్నాయి. జెండా పాట క్వింటాకు రూ. 19 వేలు నిర్ధరించిన వ్యాపారులు... కనిష్ఠంగా రూ. 17 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఒక్క రోజే సుమారు 80 వేల బస్తాలు మార్కెట్కు తరలివచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్లో ఇదే అత్యధికమని పేర్కొన్నారు.
![huge crowd of mirchi farmers to khammam market yard](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14466560_mirchi3.png)
ఓ వైపు అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గినా.. మద్దతు ధరలు పెరగడం రైతులకు ఊరట కలిగిస్తోంది. మిర్చి నాణ్యతను బట్టి వ్యాపారులు ధరను నిర్ణయిస్తున్నారు.
![huge crowd of mirchi farmers to khammam market yard](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14466560_mirchi1.png)
ఇవీ చదవండి: App for Mirchi Drip Irrigation: 'మిర్చి మిత్ర'తో.. సాగులో లాభాల యాత్ర