ETV Bharat / state

ఖమ్మం మార్కెట్​కు పోటెత్తిన మిర్చి.. ఈరోజు ధర ఎంతంటే.!

author img

By

Published : Feb 14, 2022, 7:34 PM IST

Mirchi rush at Khammam Market yard: రాష్ట్రంలో మిర్చి కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి.​ ఖమ్మం మార్కెట్​కు నేడు భారీగా మిర్చి తరలివచ్చింది. ఈ ఒక్కరోజే సుమారుగా 80 వేల బస్తాలు మార్కెట్​కు తరలిరాగా.. ఈ సీజన్​లో ఇదే అత్యధిక సంఖ్యగా నమోదైంది.

huge crowd of mirchi farmers to khammam market yard
ఖమ్మం మార్కెట్​ యార్డులో మిర్చి కొనుగోళ్లు

Mirchi rush at Khammam Market yard: ఖమ్మం మార్కెట్‌కు మిర్చి భారీగా తరలివచ్చింది. రెండు రోజుల తర్వాత మార్కెట్‌ తెరవటంతో అధిక సంఖ్యలో మిర్చిని రైతులు తీసుకొచ్చారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా జిల్లాల నుంచి రైతులు మిరపను తరలించారు.

huge crowd of mirchi farmers to khammam market yard
ఖమ్మం మార్కెట్​ యార్డుకు భారీగా తరలివచ్చిన మిర్చి

మొదటి గంటలో మందకొడిగా ప్రారంభమైన కొనుగోళ్లు ఆ తర్వాత జోరందుకున్నాయి. జెండా పాట క్వింటాకు రూ. 19 వేలు నిర్ధరించిన వ్యాపారులు... కనిష్ఠంగా రూ. 17 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఒక్క రోజే సుమారు 80 వేల బస్తాలు మార్కెట్‌కు తరలివచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని పేర్కొన్నారు.

huge crowd of mirchi farmers to khammam market yard
మిర్చి కొనుగోళ్లు

ఓ వైపు అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గినా.. మద్దతు ధరలు పెరగడం రైతులకు ఊరట కలిగిస్తోంది. మిర్చి నాణ్యతను బట్టి వ్యాపారులు ధరను నిర్ణయిస్తున్నారు.

huge crowd of mirchi farmers to khammam market yard
మిర్చి కొనుగోళ్లతో కిటకిటలాడుతున్న ఖమ్మం మార్కెట్​ యార్డు

ఇవీ చదవండి: App for Mirchi Drip Irrigation: 'మిర్చి మిత్ర'తో.. సాగులో లాభాల యాత్ర

Mirchi farmer : మిర్చి రైతుకు కంప్యూటర్‌ మిత్రుడు..

Mirchi rush at Khammam Market yard: ఖమ్మం మార్కెట్‌కు మిర్చి భారీగా తరలివచ్చింది. రెండు రోజుల తర్వాత మార్కెట్‌ తెరవటంతో అధిక సంఖ్యలో మిర్చిని రైతులు తీసుకొచ్చారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా జిల్లాల నుంచి రైతులు మిరపను తరలించారు.

huge crowd of mirchi farmers to khammam market yard
ఖమ్మం మార్కెట్​ యార్డుకు భారీగా తరలివచ్చిన మిర్చి

మొదటి గంటలో మందకొడిగా ప్రారంభమైన కొనుగోళ్లు ఆ తర్వాత జోరందుకున్నాయి. జెండా పాట క్వింటాకు రూ. 19 వేలు నిర్ధరించిన వ్యాపారులు... కనిష్ఠంగా రూ. 17 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఒక్క రోజే సుమారు 80 వేల బస్తాలు మార్కెట్‌కు తరలివచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని పేర్కొన్నారు.

huge crowd of mirchi farmers to khammam market yard
మిర్చి కొనుగోళ్లు

ఓ వైపు అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గినా.. మద్దతు ధరలు పెరగడం రైతులకు ఊరట కలిగిస్తోంది. మిర్చి నాణ్యతను బట్టి వ్యాపారులు ధరను నిర్ణయిస్తున్నారు.

huge crowd of mirchi farmers to khammam market yard
మిర్చి కొనుగోళ్లతో కిటకిటలాడుతున్న ఖమ్మం మార్కెట్​ యార్డు

ఇవీ చదవండి: App for Mirchi Drip Irrigation: 'మిర్చి మిత్ర'తో.. సాగులో లాభాల యాత్ర

Mirchi farmer : మిర్చి రైతుకు కంప్యూటర్‌ మిత్రుడు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.