ఖమ్మం జిల్లా సింగరేణి, కామేపల్లి మండలాల్లో జోరువాన కురిసింది. వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ఇల్లందు నియోజకవర్గంలో ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. వాన కారణంగా జేకే 5, కోయగూడెం సింగరేణి ఉపరితల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.