ETV Bharat / state

ఈ ఇంజినీరింగ్​ విద్యార్థుల అరెస్టుకు పెద్ద కారణమే ఉంది..

ఇంజినీరింగ్ చదివి బాగుపడతావనుకున్నారు వారి తల్లిదండ్రులు. కానీ ఆ విద్యార్థులు మాత్రం జల్సాల రుచి మరిగి.. పక్కదారి పట్టారు. ఫలితంగా ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు. ఇంతకీ వారు చేసిన నేరం ఏమిటంటే...!

author img

By

Published : Aug 17, 2019, 11:46 PM IST

Updated : Aug 18, 2019, 12:48 PM IST

గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇంజినీరింగ్​ విద్యార్థులు అరెస్ట్​

హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు ఇంజినీరింగ్​ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. 8 కిలోల గంజాయి, 8 చరవాణీలు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్​ సీఐ రామకృష్ణ వెల్లడించారు. శంషాబాద్​ బస్టాండ్​ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ఖమ్మం జిల్లా ప్రాంతానికి చెందిన తుమ్మ భానుతేజరెడ్డి, దుబ్బాక సాయి నరేష్‌, కర్నాటి అఖిల్, షేక్ నయీం, కొండ సాయికుమార్ గంజాయికి బానిసలుగా మారారని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్​ రాజేంద్రనగర్​ పరిధిలోని శ్రీమల్లె కాలనీలో అద్దెకు ఉంటున్నారని తెలిపారు. సీలేరు, అరకు వంటి ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలోని ఇంజినీరింగ్​ విద్యార్థులు, సాఫ్టేవేర్​ ఇంజినీర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఇంజినీరింగ్​ విద్యార్థుల అరెస్టుకు పెద్ద కారణమే ఉంది..

ఇవీ చూడండి: వరద ముంచెత్తింది... ఊరు రోడ్డున పడింది!

హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు ఇంజినీరింగ్​ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. 8 కిలోల గంజాయి, 8 చరవాణీలు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్​ సీఐ రామకృష్ణ వెల్లడించారు. శంషాబాద్​ బస్టాండ్​ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ఖమ్మం జిల్లా ప్రాంతానికి చెందిన తుమ్మ భానుతేజరెడ్డి, దుబ్బాక సాయి నరేష్‌, కర్నాటి అఖిల్, షేక్ నయీం, కొండ సాయికుమార్ గంజాయికి బానిసలుగా మారారని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్​ రాజేంద్రనగర్​ పరిధిలోని శ్రీమల్లె కాలనీలో అద్దెకు ఉంటున్నారని తెలిపారు. సీలేరు, అరకు వంటి ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలోని ఇంజినీరింగ్​ విద్యార్థులు, సాఫ్టేవేర్​ ఇంజినీర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఇంజినీరింగ్​ విద్యార్థుల అరెస్టుకు పెద్ద కారణమే ఉంది..

ఇవీ చూడండి: వరద ముంచెత్తింది... ఊరు రోడ్డున పడింది!

TG_Hyd_70_17_Ganjai_Students_Arrest_AB_TS10020 Contributor: Bhujanga Reddy Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది ( ) హైదరాబాద్ నగర శివారు శంషాబాద్‌లో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురుతో కూడిన ఇంజినీరింగ్ విద్యార్థుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 8కిలోల గంజాయితోపాటు 8చరవాణీలు 4ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ విమానాశ్రయ పోలీసు ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ వెల్లడించారు. ఖమ్మం జిల్లా ప్రాంతానికి చెందిన తుమ్మ భానుతేజ రెడ్డి, దుబ్బాక సాయి నరేష్‌, కర్నాటి అఖిల్, షేక్ నయీం, కొండ సాయికుమార్ ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసుకున్నారు.వీరు గంజాయికి బానిసలుగా మారి రాజేంద్రనగర్ పరిధి హైదర్‌గూడ లోని శ్రీమల్లె కాలనీలో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారని సీఐ పేర్కొన్నారు. అంతేకాకుండా సిలేరు అరకు ప్రాంతానికి వెళ్లి 12కిలోల గంజాయిని కొనుగోలు చేసుకుని నగరానికి వచ్చారు. వీరు ఆ గంజాయిని నగరంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు విక్రయిస్తున్నారని సీఐ తెలిపారు. నిన్నటి రోజున సాయంత్రం శంషాబాద్ బస్టాండ్ వద్ద భానుతేజరెడ్డి, సాయి నరేష్ ఇద్దరు బ్యాగుపట్టుకుని ఉండగా వాహనాల తనిఖీలో ఉన్న పోలీసులను గమనించి పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకోవడంతో గంజాయి అక్రమ రవాణా విషయం బయటపడిందన్నారు. వీరిచ్చిన సమాచారంతో శ్రీమల్లే కాలనీలో 4కిలోల గంజాయితోపాటు మరో ముగ్గురిని అఖిల్, షేక్ నయీం, సాయి కుమార్ అదుపులోకి తీసుకున్నామని రామకృష్ణ వివరించారు. బైట్‌: రామకృష్ణ, విమానాశ్రయం పోలీసు సీఐ
Last Updated : Aug 18, 2019, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.