ETV Bharat / state

'వ్యాక్సిన్ వచ్చిందని నిర్లక్ష్యం వద్దు.. జాగ్రత్తలు తప్పనిసరి'

author img

By

Published : Jan 16, 2021, 4:40 PM IST

ప్రజలంతా మాస్క్​లు, శానిటైజర్లను వినియోగిస్తూ మరికొంతకాలం అప్రమత్తంగా ఉంటే కరోనా మహమ్మారిని దేశం నుంచి పూర్తిగా నిర్మూలించవచ్చని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లాలోని మధిరలో కొవిడ్​ వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

clp ledaer batti vikramarka started covid vaccination programe in khammam district
మరికొంత కాలం జాగ్రత్తలు తప్పనిసరి: బట్టి విక్రమార్క

వాక్సిన్​తో మహమ్మారి పూర్తిగా అంతం కావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా మధిరలోని సివిల్​ ఆసుపత్రిలో కొవిడ్​ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

కరోనాపై చర్యలు తీసుకోవాలని తాను ముందుగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరానని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ప్రజలంతా మాస్క్​లు, శానిటైజర్లను వినియోగిస్తూ మరికొంతకాలం అప్రమత్తంగా ఉంటే ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రిచవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్​పర్సన్​ లత, వైస్ ఛైర్​పర్సన్ విద్యాలత ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.

వాక్సిన్​తో మహమ్మారి పూర్తిగా అంతం కావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా మధిరలోని సివిల్​ ఆసుపత్రిలో కొవిడ్​ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

కరోనాపై చర్యలు తీసుకోవాలని తాను ముందుగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరానని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ప్రజలంతా మాస్క్​లు, శానిటైజర్లను వినియోగిస్తూ మరికొంతకాలం అప్రమత్తంగా ఉంటే ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రిచవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్​పర్సన్​ లత, వైస్ ఛైర్​పర్సన్ విద్యాలత ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'కేసీఆర్ తన స్వార్థం కోసం రైతులను పణంగా పెట్టారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.