భాజపా శ్రేణులు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారనే కారణంతో ఖమ్మం జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. భాజపా నాయకులు, కార్యకర్తలను ఆదివారం రాత్రి నుంచి ముందస్తు అరెస్టు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, ఇతర ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
తమకు నిరసన తెలియజేసే హక్కు లేదా అని జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ అరెస్ట్లను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఇదీ చదవండి: మందకొడిగా సాగుతున్న జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను వసూళ్లు...