ETV Bharat / state

ఖమ్మంలో అంబేడ్కర్‌ జయంతి... కార్మికుల కాళ్లు కడిగి సన్మానం

author img

By

Published : Apr 14, 2020, 5:32 PM IST

అంబేడ్కర్‌ 129వ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఏన్కూరులో భాజపా మండల కమిటీ ఆధ్వర్యంలో పారిశుధ్ద్య కార్మికులకు కాళ్లు కడిగి సన్మానం చేశారు. పలుచోట్ల నిత్యావసరాలు పంపిణీ చేశారు.

అంబేడ్కర్‌ జయంతి... కార్మికుల కాళ్లు కడిగి సన్మానం
అంబేడ్కర్‌ జయంతి... కార్మికుల కాళ్లు కడిగి సన్మానం

ఖమ్మం జిల్లా ఏన్కూరు, తల్లాడ మండలాల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఏన్కూరులో భాజపా మండల కమిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి సన్మానం చేశారు. తల్లాడ మండలంలో పలుచోట్ల పేదలకు, వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్‌, మార్క్‌ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌తోపాటు పలువురు ప్రముఖులు అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఆయన ఆశయాలు, అడుగుజాడల్లో ముందుకు సాగాలని సూచించారు.

ఖమ్మం జిల్లా ఏన్కూరు, తల్లాడ మండలాల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఏన్కూరులో భాజపా మండల కమిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి సన్మానం చేశారు. తల్లాడ మండలంలో పలుచోట్ల పేదలకు, వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్‌, మార్క్‌ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌తోపాటు పలువురు ప్రముఖులు అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఆయన ఆశయాలు, అడుగుజాడల్లో ముందుకు సాగాలని సూచించారు.

ఇవీచూడండి: 'మిమ్మల్ని ఎప్పుడో క్వారంటైన్​లో పెట్టారు... అయినా మీలో మార్పులేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.