ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లారం గ్రామంలో నాంచారమ్మ తల్లి ఆలయానికి కరివేద రాంబాబు సోదరులు భారీ ధ్వజస్తంభం బహుకరించారు. 42 అడుగుల పొడవున్న ఈ రాతి ధ్వజస్తంభానికి గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గ్రామ వీధుల్లో ఊరేగింపు జరిపారు. త్వరలోనే ఈ ధ్వజస్తంభాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: వెయ్యి కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా.. వెల్లడించిన కాగ్ నివేదిక